'చంద్రబాబు నాయుడు నియంతలా వ్యవహరిస్తున్నారు' గుంటూరులో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్‌సీపీ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేశారు: వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి.



 తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం కూల్చివేత

ఉదయం 5:30 గంటల సమయంలో పొక్లైన్లు, బుల్డోజర్లతో భవనాన్ని కూల్చివేత.

శ్లాబ్‌కు సిద్ధంగా ఉన్న భవనాన్ని కూల్చివేస్తున్న అధికారులు.

కూల్చివేతకు సీఆర్డీయే ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్‌ను సవాల్‌చేస్తూ నిన్న హైకోర్టును ఆశ్రయించిన వైయస్సార్‌సీపీ

చట్టాన్ని మీరి వ్యవహరించ వద్దని హైకోర్టు ఆదేశం.

సీఆర్డీయే కమిషనర్‌కు హైకోర్టు ఆదేశాలను తెలియజేసిన వైయస్సార్‌సీపీ న్యాయవాది

హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ వైయస్సార్‌సీపీ కార్యాలయభవనాన్ని కూల్చివేశారంటున్న వైయస్సార్‌సీపీ

కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని, హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామంటున్న వైయస్సార్‌సీపీ.




ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన  కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు, ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్లపాటు పాలన ఏవిధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు. ఈ బెదిరింపులకు, ఈ కక్షసాధింపు చర్యలకు తలొగ్గేది లేదు, వెన్నుచూపేది అంతకన్నా లేదు. ప్రజల తరఫున, ప్రజలకోసం, ప్రజలతోడుగా గట్టిపోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నాను.


No comments:

Post a Comment

How Hair Serums Work Their Wonders

Hair serums have become a staple in many hair care routines, promising everything from frizz control to dazzling shine. But what exactly are...